బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ రేంజర్ల హతం
- January 04, 2018
జమ్ము కాశ్మీర్:జమ్ము కాశ్మీర్ సాంబా సెక్టార్లో రెచ్చిపోతున్న పాక్ రేంజర్లకు బీఎస్ఎఫ్ దళాలు గట్టిగా జవాబు చెప్పాయి. ఎల్ఓసీలోని మూడు పాక్ పోస్టులను ధ్వంసం చేసిన భారత జవాన్లు 12 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. బుధవారం నుంచి సాంబా సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. వారి కాల్పుల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఒక జవాన్ కూడా అమరుడయ్యాడు. దీంతో ఉదయం పాక్ పోస్టులపై విరుచుకుపడ్డ బీఎస్ఎఫ్ జవాన్లు విధ్వంసం సృష్టించారు.
ఉదయం ఐదున్నర నుంచి ఎల్ఓసీలో భారత జవాన్లు కాల్పులు ప్రారంభించారు. పాక్ వైపు నుంచి వచ్చిన మూడు మోర్టార్ పొజిషన్స్ గుర్తించిన జవాన్లు వాటిని టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. ధ్వంసం చేశాయి. ఎల్ఓసీ లోంచి భారత్లోకి చొరబడుతున్నఒకరిని కాల్చిచంపాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 12 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి ప్రకటించారు
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!