ఇండియాకి వెళుతున్నారా? ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్!
- January 04, 2018
మస్కట్: ఒమన్ నుంచి ఇండియాలోని ముంబైకి వెళ్ళే ప్రయాణీకులు తమతోపాటు 50 కిలోల చెక్ ఇన్ బ్యాగేజ్ని తీసుకెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. జనవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇండియాలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రత్యేకంగా యాడ్ ఆన్ ఫేర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వారానికి 24 విమానాల్ని ఒమన్ నుంచి ఇండియాకి ఎయిర్ ఇండియా నడుపుతోంది. వీటిల్లో ముంబై, చెన్నయ్ మరియు ఢిల్లీలకు నాన్ స్టాప్ ఫ్లైట్స్తోపాటుగా, వారంలో మూడుసార్లు హైద్రాబాద్, బెంగళూరుకి వెళ్ళే విమానాలూ ఉన్నాయి. ఈ లగేజ్ ఆఫర్ని పొందాలనుకునే ప్రయాణీకులు ఒమన్లోని ఎయిర్ ఇండియా కార్యాలయాలు లేదా, సంబంధిత ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!