చోరీకి గురైన అత్యంత ఖరీదైన మద్యం సీసా
- January 04, 2018
డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసా చోరీకి గురైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూసో బాల్టీక్ అనే వోడ్కా బాటిల్ ఖరీదు 1.3 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8.2 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా దీనికి గుర్తింపు ఉంది.
ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు. కోపెన్హాగెన్లోని 33 కెఫె అనే బార్లో ఈ సీసాను ప్రదర్శనకు ఉంచారు. బార్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఓ వ్యక్తి టోపీతో వచ్చి ఈ సీసాను దొంగిలించినట్లు రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









