మెగాస్టార్, మోహన్ బాబు, రాజశేఖర్ న్యూఇయర్ పార్టీ
- January 05, 2018
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ ముందు నుండి ఇండస్ట్రీలో భిన్న ధృవాలుగానే ఉంటూ వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వీరి మధ్య మంచి స్నేహమే ఉండేది. అయితే కాలక్రమంలో కొన్ని పరిస్థితులు వీరి మధ్య విబేధాలకు కారణమైంది. అయితే విబేధాలు ఎల్లకాలం ఉండవు అనేది జగమెరిగిన సత్యం. చాలా రోజుల క్రితమే వీరి మధ్య సత్సబంధాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ముగ్గురూ కలిసి ఇటీవల న్యూఇయర్ పార్టీలో సందడి చేశారు.
ఈ ముగ్గురినీ ఇప్పటి వరకు ఒకే ఫ్రేములో చూడలేదని, ఇలా ముగ్గురినీ ఒకే చోట చూడటం ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పార్క్ హయత్ హోటల్లో ఇటీవల కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి న్యూ ఇయర్ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు.
న్యూఇయర్ పార్టీలో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
టి సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో అన్నయ్య చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్నారు.
ఈ న్యూఇయర్ పార్టీలో ప్రముఖ తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు.
ఇటీవల విడుదలైన రాజశేఖర్ 'గరుడ వేగ' చిత్రానికి చిరంజీవి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో చిరంజీవితో మోహన్ బాబుకు, రాజశేఖర్కు కొన్ని విబేధాలు నెలకొన్నాయన్నది జగమెరిగన సత్యం. పలు వేడుకల్లో మోహన్ బాబు స్వయంగా చిరంజీవిపై కామెంట్స్ చేశారు. రాజశేఖర్ గతంలో ప్రెస్ మీట్లు పెట్టిమరీ చిరంజీవిపై విమర్శలు చేశారు. అయితే పాత విషయాలన్నీ మరిచిపోయి ఇపుడు ముగ్గురూ మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







