టొరంటో:ఎయిర్పోర్ట్లో ఢీకొన్న రెండు విమానాలు
- January 05, 2018
టొరంటో: కెనడాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. టొరంటో విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. అసలే దట్టమైన మంచుతో వణికిపోతున్న ప్రయాణికులకు.. విమానాలు ఢీకొన్న ఘటన మరింత భయభ్రాంతులకు గురిచేసింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వెస్ట్జెట్కు చెందిన విమానం మెక్సికో నుంచి టొరంటోకు చేరుకున్నది. ఆ విమానంలో సుమారు 168 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఎయిర్పోర్ట్లోని గేటు వద్ద సన్వింగ్ సంస్థ విమానం వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెస్ట్జెట్ విమానాన్ని ఢీకొట్టింది. అయితే రెండు విమానాలు ఢీకొనగానే, ఓ విమానం నుంచి మంటలు వ్యాపించాయి. వెస్ట్జెట్ విమానంలో ఉన్న ప్రయాణికులను వెంటనే దించేశారు. ఎమర్జెన్సీ ైస్లెడ్స్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సన్వింగ సంస్థ విమానంలో మాత్రం ప్రమాద సమయంలో ఎవరూ లేరు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు కెనడా విమానశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!