'టచ్ చేసి చూడు' టీజర్ విడుదల
- January 05, 2018
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది 'రాజా ది గ్రేట్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే 'టచ్ చేసి చూడు' అంటూ సవాల్ విసరబోతున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. రాశీఖన్నా కథానాయిక. ఈ సినిమా టీజర్ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చిపారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లాద్దాలు తీసి స్టైల్గా రవితేజ నడిచి వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోపక్క రవితేజ తన సినిమాల జోరు పెంచేశారు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న 'అ!' చిత్రంలో ఓ చెట్టుకు వాయిస్ ఓవర్ ఇవ్వగా, కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాళవిక శర్మ ఇందులో కథానాయిక. రామ్ తుళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'నేల టికెట్' అనే పేరు పరిశీలనలో ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల