బాహుబలి సినిమా నిర్మాతల భారీ సీరియల్
- January 06, 2018
తెలుగు సినిమాగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ వందకోట్లు దాటడమే కష్టంగా ఉన్న సమయంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ.. తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ బుల్లితెర మీద సంచలనాలకు తెర తీసింది.
బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ కోసం సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







