గల్ఫ్ కప్ ఫైనల్: బ్యారియర్ కూలి 40 మందికి గాయాలు
- January 06, 2018
కువైట్లో ఒమన్ - యూఏఈ మధ్య జరిగిన గల్ఫ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బ్యారియర్ కూలి 40 మందికి గాయాలయ్యాయి. మ్యాచ్ని ఒమన్ గెలిచిన కాస్సేపటికే ఈ ప్రమాదం జరిగింది. కువైట్ ఎఫ్ఎ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం - కువైట్ సిటీలో ఈ ప్రమాదం జరిగిందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. గాయపడ్డవారంతా క్షేమంగానే ఉన్నారని కువైట్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆటగాళ్ళను అభినందించే క్రమంలో అభిమానులు చూపించిన అత్యుత్సాహం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







