ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన సౌదీ ప్రభుత్వం..
- January 06, 2018
సౌదీఅరేబియా : ' ఒక కీడు .... మరో మేలుకె అని మన తెలుగు రాష్ట్రాలలో అంటారు..సౌదీలో అది నిజమైంది. విలువ ఆధారిత పన్ను ( వేట్ )అమల్లోకి వచ్చిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచింది ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ' మనసున్న మారాజుగా ' పేరు తెచ్చుకొన్న సౌదీ రాజు సానుకూలంగా స్పందించారు..పెరిగిన పన్ను విషయమై భయపడకండి..మీ అందరికి జీతాలు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం వెయ్యి రియాళ్ళు పెంచుతున్నామన్నారు. ముఖ్యంగా దక్షిణ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు 5 వేల రియాళ్లను పెంచారు. ఈ పెరిగిన జీతం జనవరి 1 వ తేదీ నుంచే అమలోకి వస్తుందని ఆయన తెలిపారు. పాపం ...అరకొర జీతం తీసుకొనే కొందరు ప్రయివేట్ ఉద్యోగులు తమనేవారు ఆదుకొంటారన్నట్లుగా బిక్క మొహలతో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి







