ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన సౌదీ ప్రభుత్వం..
- January 06, 2018
సౌదీఅరేబియా : ' ఒక కీడు .... మరో మేలుకె అని మన తెలుగు రాష్ట్రాలలో అంటారు..సౌదీలో అది నిజమైంది. విలువ ఆధారిత పన్ను ( వేట్ )అమల్లోకి వచ్చిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచింది ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ' మనసున్న మారాజుగా ' పేరు తెచ్చుకొన్న సౌదీ రాజు సానుకూలంగా స్పందించారు..పెరిగిన పన్ను విషయమై భయపడకండి..మీ అందరికి జీతాలు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం వెయ్యి రియాళ్ళు పెంచుతున్నామన్నారు. ముఖ్యంగా దక్షిణ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు 5 వేల రియాళ్లను పెంచారు. ఈ పెరిగిన జీతం జనవరి 1 వ తేదీ నుంచే అమలోకి వస్తుందని ఆయన తెలిపారు. పాపం ...అరకొర జీతం తీసుకొనే కొందరు ప్రయివేట్ ఉద్యోగులు తమనేవారు ఆదుకొంటారన్నట్లుగా బిక్క మొహలతో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







