ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన సౌదీ ప్రభుత్వం..
- January 06, 2018
సౌదీఅరేబియా : ' ఒక కీడు .... మరో మేలుకె అని మన తెలుగు రాష్ట్రాలలో అంటారు..సౌదీలో అది నిజమైంది. విలువ ఆధారిత పన్ను ( వేట్ )అమల్లోకి వచ్చిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచింది ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ' మనసున్న మారాజుగా ' పేరు తెచ్చుకొన్న సౌదీ రాజు సానుకూలంగా స్పందించారు..పెరిగిన పన్ను విషయమై భయపడకండి..మీ అందరికి జీతాలు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం వెయ్యి రియాళ్ళు పెంచుతున్నామన్నారు. ముఖ్యంగా దక్షిణ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు 5 వేల రియాళ్లను పెంచారు. ఈ పెరిగిన జీతం జనవరి 1 వ తేదీ నుంచే అమలోకి వస్తుందని ఆయన తెలిపారు. పాపం ...అరకొర జీతం తీసుకొనే కొందరు ప్రయివేట్ ఉద్యోగులు తమనేవారు ఆదుకొంటారన్నట్లుగా బిక్క మొహలతో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







