2017 లో బహ్రెయిన్ రోడ్లపై 40 మందికి పైగా ప్రజలు మృతి
- January 06, 2018
మనామా : గత ఏడాది బహ్రెయిన్ రోడ్లపై 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ప్రకారం, 2017 మొదటి మూడు త్రైమాసికాల్లో కింగ్డమ్ లో రోడ్డు ప్రమాదాలలో నలభైమంది మరణించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం వాహనదారులు ఎరుపు సంకేతాలను దాటివెళ్లిపోవడం వలన జరుగుతున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపిన సమాచారం ప్రకారం 2017 లో జనవరి, అక్టోబర్ మధ్యకాలంలో దేశంలో 932 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 890 మంది గాయపడ్డారు. 377 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. 2016 లో బహ్రెయిన్ మొత్తం మీద 1,408 ప్రమాదాలే నమోదు కాబడ్డాయి. ఆ ఏడాది 47 మంది మరణించారు. అదేవిధంగా1300 మంది గాయపడ్డారు.2014 లో 23 వ చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరోధించడానికి ఫిబ్రవరిలో ఒక పాయింట్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, రాజ్యంలో పటిష్టమైన శిక్షలు అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ షైక్ నాజర్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా మాట్లాడుతూ, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినవారికి అవగాహన కల్పించడం..అలాగే వాహనాలు నడిపే డ్రైవర్లు బాధ్యతయుతంగా ప్రవర్తించేవిధంగా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదని ఆయన తెలిపారు "
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







