మోదీ, గాంధీ లతో సెల్ఫీ
- January 06, 2018
జాతిపిత మహాత్మాగాంధీతో ప్రధాని నరేంద్రమోదీ కలిసి ఉన్న ఈ దృశ్యం మన భాగ్యనగరంలోని చారిత్రక చార్మినార్ వద్ద శనివారం సాక్షాత్కరించింది. గాంధీ మహాత్ముడితో ప్రధాని మోదీ భేటీ ఎలా సాధ్యం..? ఇందుకు అవకాశమే లేదు కదా..?? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా..! మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులూ.. ఎంతమాత్రం నరేంద్ర మోదీ, గాంధీజీలు కాదు.. అచ్చుగుద్దినట్టు వారి పోలికలతో కనిపిస్తోన్న సదానంద్నాయక్, అగస్టీన్లు.. కర్ణాటక, గోవాల నుంచి హైదరాబాద్ సందర్శనకు వచ్చిన ఈ ఇద్దరూ చార్మినార్ వద్ద యాదృచ్ఛికంగా కలిశారు. దీంతో పర్యాటకులు, స్థానికులు వీరిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా యువత వారితో పెద్దఎత్తున సెల్ఫీలు దిగడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!