మోదీ, గాంధీ లతో సెల్ఫీ
- January 06, 2018
జాతిపిత మహాత్మాగాంధీతో ప్రధాని నరేంద్రమోదీ కలిసి ఉన్న ఈ దృశ్యం మన భాగ్యనగరంలోని చారిత్రక చార్మినార్ వద్ద శనివారం సాక్షాత్కరించింది. గాంధీ మహాత్ముడితో ప్రధాని మోదీ భేటీ ఎలా సాధ్యం..? ఇందుకు అవకాశమే లేదు కదా..?? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా..! మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులూ.. ఎంతమాత్రం నరేంద్ర మోదీ, గాంధీజీలు కాదు.. అచ్చుగుద్దినట్టు వారి పోలికలతో కనిపిస్తోన్న సదానంద్నాయక్, అగస్టీన్లు.. కర్ణాటక, గోవాల నుంచి హైదరాబాద్ సందర్శనకు వచ్చిన ఈ ఇద్దరూ చార్మినార్ వద్ద యాదృచ్ఛికంగా కలిశారు. దీంతో పర్యాటకులు, స్థానికులు వీరిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా యువత వారితో పెద్దఎత్తున సెల్ఫీలు దిగడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







