5 కే రన్‌లో అపశ్రుతి......తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు

- January 07, 2018 , by Maagulf
5 కే రన్‌లో అపశ్రుతి......తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన 5 కే రన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. రన్‌ను విజయవంతం చేసేపనిలో పడ్డ అధికారుుల ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి తీసుకురావడంతో కొందరు చలి తీవ్రతకు తట్టుకోలేక రన్‌లో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు కోలుకోగా.. ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com