'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ విడుదల
- January 07, 2018
హైదరాబాద్: 'ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం' అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. సరదా సన్నివేశాలతో ఈ టీజర్ను రూపొందించారు.
పూజారులుగా ఇక్కడ జీవితం సాగిస్తున్న బ్రహ్మనందం, ఆయన బృందంతో విష్ణు అమెరికాకు వెళ్దామని, అక్కడైతే డాలర్లు సంపాదించొచ్చని చెబుతారు. దీంతో అందరూ కలిసి అమెరికా వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే సంఘటనలను వినోదబరితంగా టీజర్లో చూపించారు. చివర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి.
జి నాగేశ్వరరెడ్డి 'ఆచారి అమెరికా యాత్ర'కు దర్శకత్వం వహించారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్ సింగ్ ఠాకూర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







