చారిటీకోసం అతిలోక సుందరి ఆర్ట్ వేలం
- January 08, 2018
టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్కి వెళ్లి అక్కడ కూడా తన అందంతో అందరికీ కిక్కెంచింది. బోనీకపూర్ని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఆ తరువాత అడపా దడపా సినిమాల్లో చేసినా ఇంతకు ముందులా రెగ్యులర్గా స్క్రీన్ పై సందడి చేయట్లేదు. ఇంగ్లీష్ వింగ్లీష్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది. కానీ ఆ తరువాత వచ్చిన మామ్ అభిమానుల ఆదరణకు నోచుకోలేదు. అయితే పెద్ద కూతురు జాహ్నవి నటించే సినిమాలో తను కూడా ఓ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవికి పెయింటింగ్ చేయడమంటే చాలా ఇష్టమట. గత ఐదు సంవత్సరాలుగా పెయింటింగ్స్ వేస్తోందట. తనకు నచ్చిన వారికి ఇవ్వడం కోసం అందంగా పెయింటింగ్స్ వేసి తనకు వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుందట. ఇటీవల సోనమ్ కపూర్కి ఓ అందమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట. ఇక సల్మాన్ ఖాన్, మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ గిప్ట్గా ఇచ్చినట్లు సమాచారం. అయితే వచ్చే నెలలో దుబాయ్ లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ శ్రీదేవి పెయింటింగులతో ఓ షో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని ఓ చారిటీ నిధి కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







