దక్షిణ చైనా సముద్రంలో నౌకా ప్రమాదం
- January 08, 2018
హాంగ్ కాంగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓ ఇంధన ట్యాంకర్, మరో రవాణా నౌక ఢీకొన్న ఘటనలో 32 మంది నౌకా సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన సాంచి నౌకలో వారంతా ఉన్నట్లు సమాచారం. అందులో ఇరాన్కు చెందిన 30 మంది, బంగ్లాదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదని చైనా రవాణా శాఖ పేర్కొన్నది. యాంగ్జీ నదికి 180 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ సాంచి నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి. దాని నుంచి భారీ స్థాయిలో దట్టమైన నల్లటి పొగ కూడా వస్తున్నది. సీఎఫ్ క్రిస్టల్ రవాణా నౌకలో ఉన్న 21 మంది చైనా సిబ్బంది మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంచీ నౌకలో సుమారు లక్షన్నర టన్నులు ఆయిల్ ఉన్నది. ఇరాన్ నుంచి సౌత్కొరియాకు ఆ ఇంధనాన్ని తీసుకెళ్లుతున్నారు. సీఎఫ్ క్రిస్టల్ నౌకలో అమెరికా నుంచి చైనాకు ఆహారపదార్ధాలను రవాణా చేస్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!