గుండు హనుమంతరావుకి సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం
- January 08, 2018

ఒకప్పుడు కామెడీతో అలరించిన గుండు హనుమంతరావు ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఈ మధ్య ఓ కార్యక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ప్రస్తుతం తాను కష్టాలలో ఉన్నట్టు కూడా తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి గుండు హనుమంతరావుకి 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదుని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదల చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుండుకి వారంలో మూడు సార్లు డయాలసిస్ జరగాల్సి ఉండగా, చికిత్సకి అవసరమైన సొమ్ము లేకపోవడంతో ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ కమెడీయన్ కి సాయం అందించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో







