దక్షిణ చైనా సముద్రంలో నౌకా ప్రమాదం
- January 08, 2018
హాంగ్ కాంగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓ ఇంధన ట్యాంకర్, మరో రవాణా నౌక ఢీకొన్న ఘటనలో 32 మంది నౌకా సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన సాంచి నౌకలో వారంతా ఉన్నట్లు సమాచారం. అందులో ఇరాన్కు చెందిన 30 మంది, బంగ్లాదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదని చైనా రవాణా శాఖ పేర్కొన్నది. యాంగ్జీ నదికి 180 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ సాంచి నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి. దాని నుంచి భారీ స్థాయిలో దట్టమైన నల్లటి పొగ కూడా వస్తున్నది. సీఎఫ్ క్రిస్టల్ రవాణా నౌకలో ఉన్న 21 మంది చైనా సిబ్బంది మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంచీ నౌకలో సుమారు లక్షన్నర టన్నులు ఆయిల్ ఉన్నది. ఇరాన్ నుంచి సౌత్కొరియాకు ఆ ఇంధనాన్ని తీసుకెళ్లుతున్నారు. సీఎఫ్ క్రిస్టల్ నౌకలో అమెరికా నుంచి చైనాకు ఆహారపదార్ధాలను రవాణా చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







