దక్షిణ చైనా సముద్రంలో నౌకా ప్రమాదం
- January 08, 2018
హాంగ్ కాంగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓ ఇంధన ట్యాంకర్, మరో రవాణా నౌక ఢీకొన్న ఘటనలో 32 మంది నౌకా సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన సాంచి నౌకలో వారంతా ఉన్నట్లు సమాచారం. అందులో ఇరాన్కు చెందిన 30 మంది, బంగ్లాదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదని చైనా రవాణా శాఖ పేర్కొన్నది. యాంగ్జీ నదికి 180 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ సాంచి నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి. దాని నుంచి భారీ స్థాయిలో దట్టమైన నల్లటి పొగ కూడా వస్తున్నది. సీఎఫ్ క్రిస్టల్ రవాణా నౌకలో ఉన్న 21 మంది చైనా సిబ్బంది మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంచీ నౌకలో సుమారు లక్షన్నర టన్నులు ఆయిల్ ఉన్నది. ఇరాన్ నుంచి సౌత్కొరియాకు ఆ ఇంధనాన్ని తీసుకెళ్లుతున్నారు. సీఎఫ్ క్రిస్టల్ నౌకలో అమెరికా నుంచి చైనాకు ఆహారపదార్ధాలను రవాణా చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







