యావత్ భారతదేశంలోనూ నిర్వహిస్తాం: నారా భువనేశ్వరి
- January 09, 2018
హైదరాబాద్: నందమూరి 22వ వర్ధంతి సందర్భంగా జనవరి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని 150 కేంద్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చీఫ్ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ''రెండేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. నీరు లేనిదే మనిషి లేడు. ఫ్లోరైడ్, ఉప్పు, నీరు ఉన్న చోట 67 ఎన్టీఆర్ సుజలా ప్లాంట్స్ స్థాపించాం. దీని ద్వారా 2 లక్షల మందికి రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు.
మహబూబ్నగర్, కర్నూల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఉత్తరాఖండ్ తుఫాన్ బాధితులకు 15 కోట్ల విలువైన మందులు, బట్టలు పంపిణీ చేశాం. 150 శిబిరాల ద్వారా సుమారు 15 వేల మంది రక్తదానం చేసిన వారికి కృతజ్ణతలు. అలాగే దీనికి సహకరించిన ఇండియన్ రెడ్క్రాస్, రోటరీ లయన్స్, బసవరామతారక కాన్సర్ ఆసుపత్రి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అన్నారు.
తాజా వార్తలు
- 5 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!







