యావత్ భారతదేశంలోనూ నిర్వహిస్తాం: నారా భువనేశ్వరి
- January 09, 2018
హైదరాబాద్: నందమూరి 22వ వర్ధంతి సందర్భంగా జనవరి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని 150 కేంద్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చీఫ్ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ''రెండేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. నీరు లేనిదే మనిషి లేడు. ఫ్లోరైడ్, ఉప్పు, నీరు ఉన్న చోట 67 ఎన్టీఆర్ సుజలా ప్లాంట్స్ స్థాపించాం. దీని ద్వారా 2 లక్షల మందికి రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు.
మహబూబ్నగర్, కర్నూల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఉత్తరాఖండ్ తుఫాన్ బాధితులకు 15 కోట్ల విలువైన మందులు, బట్టలు పంపిణీ చేశాం. 150 శిబిరాల ద్వారా సుమారు 15 వేల మంది రక్తదానం చేసిన వారికి కృతజ్ణతలు. అలాగే దీనికి సహకరించిన ఇండియన్ రెడ్క్రాస్, రోటరీ లయన్స్, బసవరామతారక కాన్సర్ ఆసుపత్రి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు