మొన్నేగా పెళ్లైంది.. అప్పుడే అనుష్క శర్మకు ఏమైంది
- January 10, 2018మోస్ట్ పాపులర్ కపుల్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విరుష్క జంట పెళ్లి అనంతరం ఎవరి రంగాల్లో వారు బిజీగా ఉన్నారు. కథానాయికగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సక్సెస్ అయ్యింది. తనే నిర్మాతగా, ఆ పై హీరోయిన్గా వస్తున్న 'పరి' చిత్ర టీజర్ని ట్విటర్లో విడుదల చేసింది. అందమైన ఆమె ముఖం నిండా రక్తపు మరకలు. ఒకింత బాధ, మరి కొంత ఆవేశం ఈ చిత్రంలో కనబడుతోంది. ఈ పోస్టర్ ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అనుష్కతో పాటు రీటాభరీ చక్రవర్తి, పరంబాత్రా చటర్జీ, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం షారుక్తో 'జీరో', వరుణ్ ధావన్తో 'సూయీ ధాగా' చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివాహానంతరం విరామం తీసుకున్న అనుష్క సోమవారం నుంచి షూటింగ్లో పాల్గొనబోతోంది. 'పరి' చిత్రాన్ని మార్చిలో హోలీ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత