రవితేజ- శ్రీను వైట్ల మూవీపై అప్డేట్
- January 10, 2018మాస్ మాహారాజా రవితేజ రీ ఎంట్రీతోను అదరగొడుతున్నాడు. బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ పూర్తైన తర్వాత నీ కోసం సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడా అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం వైట్ల ఈ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడట. యూఎస్ లో తన టీంతో కలిసి పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న దర్శకుడు ఈ చిత్రంలో రవితేజని ఎన్ఆర్ఐగా చూపించనున్నాడట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సినిమాని రూపొందించనున్న వైట్ల ఆగస్ట్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.
ఈ లోపే చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారని టాక్.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్