రవితేజ- శ్రీను వైట్ల మూవీపై అప్డేట్
- January 10, 2018
మాస్ మాహారాజా రవితేజ రీ ఎంట్రీతోను అదరగొడుతున్నాడు. బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ పూర్తైన తర్వాత నీ కోసం సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడా అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం వైట్ల ఈ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడట. యూఎస్ లో తన టీంతో కలిసి పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న దర్శకుడు ఈ చిత్రంలో రవితేజని ఎన్ఆర్ఐగా చూపించనున్నాడట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సినిమాని రూపొందించనున్న వైట్ల ఆగస్ట్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.
ఈ లోపే చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారని టాక్.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







