రవితేజ- శ్రీను వైట్ల మూవీపై అప్డేట్
- January 10, 2018
మాస్ మాహారాజా రవితేజ రీ ఎంట్రీతోను అదరగొడుతున్నాడు. బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ పూర్తైన తర్వాత నీ కోసం సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడా అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం వైట్ల ఈ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడట. యూఎస్ లో తన టీంతో కలిసి పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న దర్శకుడు ఈ చిత్రంలో రవితేజని ఎన్ఆర్ఐగా చూపించనున్నాడట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సినిమాని రూపొందించనున్న వైట్ల ఆగస్ట్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.
ఈ లోపే చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారని టాక్.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







