దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ ఆత్మహత్య
- January 12, 2018సంసార బంధాలనుంచి విముక్తి కోసం సన్యాసం స్వీకరిస్తే అక్కడ కూడా మనశ్శాంతి కరవాయే. ఏమి సేతుర లింగా అంటూ కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ (38) ఆత్మహత్య చేసుకున్నారు. గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్కి చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. ఆదివారం అర్థరాత్రి మఠంలో ఎవరూ లేని సమయం చూసి డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. మరుసటి ఉదయం మఠానికి వచ్చిన భక్తులు స్వామీజీ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డెత్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహానికి మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే కోరికను వెల్లడించారు స్వామీజీ సూసైడ్ నోట్లో.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?