దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ ఆత్మహత్య
- January 12, 2018
సంసార బంధాలనుంచి విముక్తి కోసం సన్యాసం స్వీకరిస్తే అక్కడ కూడా మనశ్శాంతి కరవాయే. ఏమి సేతుర లింగా అంటూ కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ (38) ఆత్మహత్య చేసుకున్నారు. గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్కి చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. ఆదివారం అర్థరాత్రి మఠంలో ఎవరూ లేని సమయం చూసి డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. మరుసటి ఉదయం మఠానికి వచ్చిన భక్తులు స్వామీజీ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డెత్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహానికి మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే కోరికను వెల్లడించారు స్వామీజీ సూసైడ్ నోట్లో.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









