తల్లి పేరుతో జక్కన్న చెక్కిన సరస్వతి నిలయం...!!
- January 12, 2018బుల్లి తెర నుంచి వెండి తెరపై దర్శకుడిగా అడుగు పెట్టిన రాజమౌళి.. బాహుబలి సినిమాతో తెలుగు వాడి జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసి.. తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాగా తాను మంచి దర్శకుడినే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని కూడా రాజమౌళి నిరూపించుకున్నారు. తన తల్లి జననీ రాజనందిని పేరిట పాఠశాల భవనం నిర్మించి తన ప్రత్యేకను చాటు కున్నారు. వివరాల్లోకి వెళ్తే...
2014 లో విశాఖ జిల్లాను హుదూద్ తుఫాను అతాకుతలం చేసింది. ఈ తుఫాన్ దాటికి విశాఖ లో పలు చెట్లు.. భారీ భవనాలు సైతం కూలిపోయాయి. అలా కూలిపోయిన భవనాల జాబితాను దర్శక దిగ్గజం రాజమౌళి పరిశీలించారు. ఆ లిస్ట్ లో 154 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ జిల్లా కశింకోటలోని దురిశేటి పెదనర్సింహ మూర్తి (డీపీఎన్) జెడ్పీ హై స్కూల్ కూడా ఉంది. దీంతో రాజమౌళి ఆ భవనాన్ని మళ్ళీ నిర్మించాలనుకున్నారు.. తన వంతు సాయంగా భవన నిర్మాణానికి రూ. 40లక్షలను అందించారు.. ఈ నేపథ్యంలో 2015 లో 4 గదులతో పాఠశాల భవననిర్మాణం ప్రారంభమైంది. ఇలా జక్కన్న చెక్కిన సరస్వతీ నిలయానికి తన తల్లి జననీ రాజనందిని పేరు పెట్టారు. అంతేకాదు.. భవన శిలాఫలకం పై రాజమౌళి తో పాటు ఎమ్ ఎమ్ కీరవాణి, వైఎస్ శోభనాద్రి, టి. ప్రశాంతి పేర్లు ఉన్నాయి. కాగా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!