మోహన్బాబు 'గాయత్రి' టీజర్ రెడీ
- January 13, 2018
డైలాగ్ కింగ్ మోహన్బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ సినిమాలో మోహన్బాబు రెండు విభిన్న పాత్రల్లో దర్శనమీయనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోహన్బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిల విమల ఫస్ట్లుక్స్ విడుదలై విశేష స్పందన పొందగా.. తాజాగా చిత్రానికి సంబందించిన టీజర్ని బయటకు వదిలింది చిత్రయూనిట్. హై ఇంటెన్సిటీ కూడిన మోహన్బాబు అప్పీరెన్స్, ఆయన నుంచి అభిమానులు కోరుకునే పవర్ఫుల్ డైలాగ్స్ చిత్రంలో ఆశించవచ్చని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది.
"రామాయణంలో రాముడికి, రావణాసురుడికి గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే.. అక్కడ వాళ్ళు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో.. ఛాయస్ ఈస్ యువర్స్" అని మోహన్బాబు పలికిన డైలాగ్ చిత్రం పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
మంచు విష్ణు, శ్రియ మొదటిసారి జతకట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇందులో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









