మోహన్బాబు 'గాయత్రి' టీజర్ రెడీ
- January 13, 2018
డైలాగ్ కింగ్ మోహన్బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ సినిమాలో మోహన్బాబు రెండు విభిన్న పాత్రల్లో దర్శనమీయనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోహన్బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిల విమల ఫస్ట్లుక్స్ విడుదలై విశేష స్పందన పొందగా.. తాజాగా చిత్రానికి సంబందించిన టీజర్ని బయటకు వదిలింది చిత్రయూనిట్. హై ఇంటెన్సిటీ కూడిన మోహన్బాబు అప్పీరెన్స్, ఆయన నుంచి అభిమానులు కోరుకునే పవర్ఫుల్ డైలాగ్స్ చిత్రంలో ఆశించవచ్చని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది.
"రామాయణంలో రాముడికి, రావణాసురుడికి గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే.. అక్కడ వాళ్ళు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో.. ఛాయస్ ఈస్ యువర్స్" అని మోహన్బాబు పలికిన డైలాగ్ చిత్రం పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
మంచు విష్ణు, శ్రియ మొదటిసారి జతకట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇందులో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







