భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- January 16, 2018
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ డీజిల్ ధర రూ.61.74 కు చేరుకోగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.71కు చేరుకుంది. మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 2014వ సంవత్సరం ఆగస్టు నెలలో ఈ స్థాయిలో ధరలు పెరగగా.. మళ్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరిగాయి.డిసెంబరు 12, 2017న దేశరాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.58.34 ఉండగా, ఒక్క నెలలోనే రూ.3.4పెరిగింది. ఇక పెట్రోలు రూ.2.09 పెరగడం గమనార్హం.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే పెట్రోలు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా సామాన్యుడికి కొంత ఊరట కలిగించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్టోబరు 2017లో ఒకే ఒకసారి ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 తగ్గించింది. దీంతో రూ.70.88గా పెట్రోలు ధర రూ.68.33కు రూ.59.14గా ఉన్న డీజిల్ ధర రూ.56.89కి చేరింది. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







