అమెరికాలో కరీంనగర్ వాసి దుర్మరణం
- January 16, 2018
అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందాడు. సౌత్ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భరత్రెడ్డి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మూడు రోజుల కిందటే జరిగింది. అయితే భరత్రెడ్డి గాయపడినట్లు మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. భరత్రెడ్డి మరణం విషయం చెప్పలేక స్నేహితులు సతమతమవుతున్నారు. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు భరత్రెడ్డి. సౌత్ఫ్లోరిడాలో ఈనెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి భరత్రెడ్డి కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు అతనిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో భరత్ గాయపడినట్లుగానే అతడి కుటుంబసభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పారు స్నేహితులు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ అన్న అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









