24న రంగస్థలం టీజర్ విడుదల
- January 16, 2018
రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ల కలయికలో రూపొందుతున్న రంగస్థలం-1985 చిత్రంపై అంచనాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రను పోషిస్తున్న రామ్చరణ్ కొత్త పోస్టర్ను విడుదలచేశారు. అదే సమయంలో ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తారని ప్రేక్షకాభిమానులు ఆశించారు. అయితే ఈ పోస్టర్లో ఈ నెల 24న టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించడంతో అభిమానులు ఊరట చెందారు. మరోవైపు రామ్చరణ్ సతీమణి ఉపాసన కూడా రంగస్థలం కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారు. రామ్చరణ్ సరసన సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రం పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో పీరియాడికల్గా సాగనుంది. ఇప్పటివరకు రాజమండ్రి, పోలవరం, హైదరాబాద్లలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. చివరి షెడ్యూల్లో మిగిలివున్న కొన్ని కీలక సన్నివేశాలను, రెండు పాటలను రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరిస్తారని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్రాజ్, రావురమేష్, అనసూయ నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!