టోక్యోలో మంత్రి కేటీఆర్
- January 17, 2018
టోక్యో: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జపాన్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రినివబుల్ ఎనర్జీ అంశంలో జపాన్కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. టోక్యోలో జరిగిన వివిధ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల అధిపతులతో మాట్లాడారు. వేస్ట్మేనేజ్మెంట్, స్మార్ట్సిటీ అంశాలపై తకుమా సంస్థతోనూ తెలంగాణ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ సంస్థ అధికారితో మాట్లాడారు. వేస్ట్మేనేజ్మెంట్, స్మార్ట్సిటీ అంశాలపై జేఎఫ్ఈ ఇంజినీరింగ్ సంస్థతోనూ ఒప్పందం జరిగింది. రెసిస్టార్లు ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్స్ సంస్థతో కూడా ఇవాళ ఒప్పందం జరిగింది. మంగళవారం మంత్రి కేటీఆర్ సౌత్కొరియాలో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్ విధానం పట్ల కూడా విదేశీ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







