భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- January 18, 2018 , by Maagulf
భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్‌ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర 80 రూపాయలకు దగ్గరిలో రూ.79.44గా రికార్డైంది. అంటే ఒక్కరోజులోనే 17పైసల మేర పైకి ఎగిసింది. ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.71.56గా, రూ.74.28గా, రూ.74.20గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్‌ ధరలు కూడా ముంబైలో బుధవారం కంటే 21 పైసలు ఎక్కువగా రూ.66.30గా నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా లీటరు డీజిల్‌ ధర ఒక్కరోజులోనే 19 పైసలు పెరిగి రూ.62.65గా ఉంది. ఇలా కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్‌లో కూడా డీజిల్‌ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.75.32ను క్రాస్‌ కాగ, డీజిల్‌ ధర లీటరుకు రూ.67.09గా ఉంది. ఇవి ఇక్కడ ఆల్‌-టైమ్‌ హైగా తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com