ప్రముఖ జానపద గాయకురాలి అదృశ్యం...శవమై తేలిన వైనం
- January 18, 2018
హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు మమత శర్మ అదృశ్యమై పొలాల్లో శవమై తేలిన ఘటన సంచలనం రేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకురాలు మమతశర్మ తన సహ గాయకుడు మోహిత్ కుమార్ తో కలిసి సోనిపట్ గోహానా పట్టణంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాటలు పాడేందుకు ఇంటి నుంచి వెళ్లింది. ఇంటినుంచి వెళ్లిన మమతశర్మను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రోహతక్ జిల్లా బనియాని గ్రామంలోని పొలాల్లో మమతశర్మ శవమై తేలింది. మమత అదృశ్యంపై తాము ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!