దుబాయ్ లో 'అన్న ఎన్టీఆర్'కు ఘన నివాళులు

- January 18, 2018 , by Maagulf

దుబాయ్: దుబాయ్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతిని వేణు గుంటుపల్లి,ముక్కు తులసి కుమార్,వంశి కొల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆ మహనీయుడికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com