ఐసిస్లో చేరిన కేరళ వ్యక్తి..సిరియాలో మృతి
- January 19, 2018
కన్నూర్: ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితుడై ఇస్లామిక్స్టేట్లో చేరిన కేరళకు చెందిన ఓ యువకుడు సిరియాలో మృతిచెందాడు. ఐసిస్ కోసం పోరాడుతూ గత నవంబరులోనే అతను చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
కన్నూర్ జిల్లాలోని వలపట్టినమ్కు చెందిన అబ్దుల్ మనఫ్(30) గతేడాది నవంబరులో సిరియాలో చనిపోయాడని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే అబ్దుల్ మృతి వార్త ఈ నెల 17నే అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని చెప్పారు. సిరియాలో ఉండే అబ్దుల్ స్నేహితుడు ఖయ్యు్మ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. కాగా.. ఖయ్యుమ్ కూడా ఐసిస్ కోసమే పోరాడుతున్నట్ల సదరు అధికారి తెలిపారు.
అబ్దుల్ కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఇండియా నాయకుడు. అయితే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఐసిస్లో చేరినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.
అబ్దుల్ సహా కేరళ నుంచి మరికొందరు యువకులు కూడా ఐసిస్లో చేరి సిరియా వెళ్లారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









