విజయ్ 62 షురూ.!
- January 20, 2018
'తుపాక్కి', 'కత్తి' వంటి బ్లాక్బస్టర్ హిట్ల తర్వాత విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. విజయ్, కీర్తిసురేష్, ఏఆర్ మురుగదాస్తో పాటు చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి విజయ్ క్లాప్కొట్టారు. ఇది విజయ్కి 62వ చిత్రం కావడం విశేషం. కీర్తిసురేష్ కథానాయిక. గతంలో విజయ్తో 'భైరవ' చిత్రంలో కలసి నటించింది కీర్తి. సన్ఫిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మురుగదాస్ ట్విట్టర్లో స్పందిస్తూ 'దీపావళి శుభాకాంక్షలు' అని ప్రస్తావించారు. సంక్రాంతి తరుణంలో దీపావళి శుభాకాంక్షలు ఏంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ 'తుపాక్కి', 'కత్తి' చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల కానుందనే విషయాన్నే ఆయన భిన్నంగా.. ముందస్తుగా ఇలా తెలియజేశారు.
'అళగియ తమిళ్ మగన్', 'ఉదయ', 'మెర్సల్' చిత్రాల తర్వాత ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్.. విజయ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తొలిరోజే విడుదల తేదీని కూడా ప్రకటించడంతో విజయ్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తప్పకుండా హ్యాట్రిక్ను సొంతం చేసుకుంటారని వారు నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









