ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్కు పేస్ జోడి
- January 20, 2018
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో లియాండర్ పేస్, పురవ్ రాజా జోడి దూసుకెళ్లుతున్నది. ఈ జంట ఆ టోర్నీ ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో పేస్-రాజా జోడి 7-6, 5-7, 7-6 స్కోర్ తేడాతో జేమీ ముర్రో-బ్రూనో సోరీస్ జంటపై గెలుపొందింది. సుమారు రెండు గంటల 54 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో నెగ్గిన పేజ్ జంట, ఆ తర్వాత రెండవ సెట్ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్ను అతికష్టంగా గెలుచుకున్నారు. తర్వాత మ్యాచ్లో పేస్ జోడి.. కొలంబియాకు చెందిన జువాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫరహాతో పోటీపడనున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







