భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్
- January 21, 2018
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీ గా కొనసాగుతున్న అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో ఆ పదవిని ఓం ప్రకాశ్ రావత్ తో భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన వారు రావత్. పలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో పని చేశారు. కాగా అయన భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్గా విధులు నిర్వహించిన రావత్ ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా పని చేశారు. పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రధాన మంత్రి అవార్డు కూడా లభించింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









