భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్
- January 21, 2018
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీ గా కొనసాగుతున్న అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో ఆ పదవిని ఓం ప్రకాశ్ రావత్ తో భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన వారు రావత్. పలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో పని చేశారు. కాగా అయన భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్గా విధులు నిర్వహించిన రావత్ ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా పని చేశారు. పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రధాన మంత్రి అవార్డు కూడా లభించింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







