ఫిబ్రవరికి మారిన మనసుకు నచ్చింది
- January 22, 2018_1516610085.jpg)
రిపబ్లిక్ డే వీకెండ్ కోసం తెలుగులో అందరి కంటే ముందు కర్చీఫ్ వేసింది మనసుకు నచ్చింది చిత్ర యూనిట్. ఈ చిత్రంతోనే దర్శకురాలిగా మారిన కృష్ణ కూతురు మంజుల.. చడీచప్పుడు లేకుండా సినిమా మొదలుపెట్టి.. షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్ తో మీడియా ముందుకొచ్చింది. రెండు నెలల కిందటే జనవరి 26న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్యూర్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మనసుకు నచ్చింది మూవీని జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించాడు. తనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ నటించింది. అలాగే త్రిథా చౌదరి అనే మరో హీరోయిన్ కూడా లీడ్ రోల్ పోషించింది. సినిమాని రిపబ్లిక్ డే కానుకగా, ఈ నెల 26న విడుదల చేసేందుకు ప్రిపేర్ అయ్యింది టీమ్. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్.
దాదాపు 20 రోజులు గ్యాప్ తీసుకోవడానికి కూడా కారణం ఉంది. జనవరి 26ను వదిలేస్తే.. తర్వాతి రెండు వారాల్లో ఖాళీ లేదు. ఫిబ్రవరి 2న రవనితేజ టచ్ చేసి చూడు, నాగశౌర్య చలో చిత్రాలు వస్తున్నాయి. ఇక 9న నిఖిల్ కిరాక్ పార్టీ, మోహన్ బాబు గాయత్రి, సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమాలు రాబోతున్నాయి. అందుకే పోటీ లేకుండా ఫిబ్రవరి మూడో వారానికి వెళ్లిపోయింది మనసుకు నచ్చింది టీమ్. మరి అప్పటికైనా ఇబ్బంది లేకుండా సినిమా రిలీజవుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!