ఫిల్మ్నగర్ దైవసన్నిధానం చైర్మన్గా మోహన్బాబు
- January 22, 2018
ఫిలింనగర్(హైదరాబాద్): హైదరాబాద్లో ఫిల్మ్నగర్ దైవసన్నిధానానికి ఎంతో పేరుంది. సినీరంగానికి చెందిన ప్రముఖులు ఎక్కువగా ఈ సన్నిధానానికి వస్తుంటారు. చాలా సినిమాలకు సంబంధించిన షూటింగ్లు ఫిల్మ్నగర్ సన్నిధానంలో ప్రారంభమైనవే. ఎంతో మంది దేవతలు కొలువున్న ఈ సన్నిధానానికి ఛైర్మన్గా డాక్టర్ మోహన్బాబు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న మురళీమోహన్ నుంచి మోహన్బాబు బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్నగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్గా మోహన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ ''దేవస్థానానికి చైర్మన్గా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. బాధ్యత తీసుకోమని ఆరునెలలుగా సుబ్బరామిరెడ్డి పట్టుబట్టారు. భక్తుల కోసమే ఈ బాధ్యత తీసుకున్నా. దైవసన్నిధానంలో ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేయం. దైవసన్నిధానంలో బ్రాహ్మణుల మధ్య గొడవలు ఉండకూడదు అని కోరుకుంటున్నా.'' అని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హాజరయ్యారు. 12మంది పాలకవర్గ సభ్యులతో స్వరూపానంద స్వామి ప్రమాణస్వీకారం చేయించారు. మోహన్బాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







