ఫిల్మ్నగర్ దైవసన్నిధానం చైర్మన్గా మోహన్బాబు
- January 22, 2018_1516610432.jpg)
ఫిలింనగర్(హైదరాబాద్): హైదరాబాద్లో ఫిల్మ్నగర్ దైవసన్నిధానానికి ఎంతో పేరుంది. సినీరంగానికి చెందిన ప్రముఖులు ఎక్కువగా ఈ సన్నిధానానికి వస్తుంటారు. చాలా సినిమాలకు సంబంధించిన షూటింగ్లు ఫిల్మ్నగర్ సన్నిధానంలో ప్రారంభమైనవే. ఎంతో మంది దేవతలు కొలువున్న ఈ సన్నిధానానికి ఛైర్మన్గా డాక్టర్ మోహన్బాబు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న మురళీమోహన్ నుంచి మోహన్బాబు బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్నగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్గా మోహన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ ''దేవస్థానానికి చైర్మన్గా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. బాధ్యత తీసుకోమని ఆరునెలలుగా సుబ్బరామిరెడ్డి పట్టుబట్టారు. భక్తుల కోసమే ఈ బాధ్యత తీసుకున్నా. దైవసన్నిధానంలో ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేయం. దైవసన్నిధానంలో బ్రాహ్మణుల మధ్య గొడవలు ఉండకూడదు అని కోరుకుంటున్నా.'' అని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హాజరయ్యారు. 12మంది పాలకవర్గ సభ్యులతో స్వరూపానంద స్వామి ప్రమాణస్వీకారం చేయించారు. మోహన్బాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!