స్పైస్జెట్ నుంచి బంపర్ ఆఫర్...
- January 22, 2018
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగాస్పైస్జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 769లకే విమాన ప్రయాణ అవకాశన్ని కల్పించింది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ఇంకా అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది స్పైస్జెట్.
దేశీయంగా ఒకవైపు ప్రయాణం కోసం.. అన్నీ కలుపుకుని రూ.769లకే టికెట్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అయితే రూ. 2469లకు టికెట్ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 25 వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ టికెట్ల కాలపరిమితి డిసెంబర్ 12 వరకు ఉంటుంది. రూ.769లతో జమ్ము - శ్రీనగర్, సిల్చార్-గువహటి, డెహ్రాడూన్ - ఢిల్లీ, అగర్తల - గువహటి, కోయంబత్తూర్ - బెంగళూరు, కోచి - బెంగళూరు, ఢిల్లీ - డెహ్రడూన్ మార్గాలలో ప్రయాణించవచ్చు. రూ.2469లతో చెన్నై - కొలంబో మార్గంలో ప్రయాణించవచ్చు.
రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ కింద బుక్ చేసుకునే టిక్కెట్లు రీఫండబుల్ అవుతాయి. అంతేకాదు, నేరుగా స్పైస్జెట్ వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇక మీల్స్, స్పైస్మ్యాక్స్ లాంటివి బుక్ చేసుకుంటే 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. దీంతోపాటు రూ.500 విలువచేసే క్రోమా వోచర్ కూడా ప్రయాణికులకు అందుతుంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే మార్పులు, చేర్పులు ఉంటాయి.
ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్లో గ్రూప్ బుకింగ్స్కు అవకాశం లేదు. స్పైస్జెట్ రోజూ 402 విమానాలను నడుపుతోంది. మొత్తం 51 గమ్యస్థానాలుండగా.. వీటిలో 44 దేశీయంగా.. 7 అంతర్జాతీయంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







