స్పైస్జెట్ బాటలోనే ఇండిగో పయనం
- January 23, 2018
స్పైస్జెట్ బాటలోనే ఇండిగో
దిల్లీ: స్పైస్జెట్ బాటలోనే మరో ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో పయనించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరిమిత కాల ఆఫర్లు, రాయితీలు ప్రకటించింది. రూ.797 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లను అందిస్తుంది. జనవరి 22 నుంచి 25 మధ్యలో ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణించే సదుపాయం ఉంది. విమానంలో పరిమిత సీట్లను మాత్రమే ఈ ఆఫర్ కింద కేటాయించడం జరిగిందని, ఒకవేళ ఆఫర్ సీట్లు అయిపోతే ధర మాములుగానే వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి నగదు వెనక్కి ఇవ్వబోమని ఇండిగో వెల్లడించింది. టికెట్ మీద విధించిన పన్నులు మాత్రమే కస్టమర్కు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాల ఆఫర్లను స్పైస్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉండగా..
అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2,469 ఉంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









