స్పైస్జెట్ బాటలోనే ఇండిగో పయనం
- January 23, 2018
స్పైస్జెట్ బాటలోనే ఇండిగో
దిల్లీ: స్పైస్జెట్ బాటలోనే మరో ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో పయనించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరిమిత కాల ఆఫర్లు, రాయితీలు ప్రకటించింది. రూ.797 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లను అందిస్తుంది. జనవరి 22 నుంచి 25 మధ్యలో ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణించే సదుపాయం ఉంది. విమానంలో పరిమిత సీట్లను మాత్రమే ఈ ఆఫర్ కింద కేటాయించడం జరిగిందని, ఒకవేళ ఆఫర్ సీట్లు అయిపోతే ధర మాములుగానే వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి నగదు వెనక్కి ఇవ్వబోమని ఇండిగో వెల్లడించింది. టికెట్ మీద విధించిన పన్నులు మాత్రమే కస్టమర్కు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాల ఆఫర్లను స్పైస్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉండగా..
అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2,469 ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







