స్పైస్జెట్ బాటలోనే ఇండిగో పయనం
- January 23, 2018
స్పైస్జెట్ బాటలోనే ఇండిగో
దిల్లీ: స్పైస్జెట్ బాటలోనే మరో ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో పయనించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరిమిత కాల ఆఫర్లు, రాయితీలు ప్రకటించింది. రూ.797 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లను అందిస్తుంది. జనవరి 22 నుంచి 25 మధ్యలో ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణించే సదుపాయం ఉంది. విమానంలో పరిమిత సీట్లను మాత్రమే ఈ ఆఫర్ కింద కేటాయించడం జరిగిందని, ఒకవేళ ఆఫర్ సీట్లు అయిపోతే ధర మాములుగానే వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి నగదు వెనక్కి ఇవ్వబోమని ఇండిగో వెల్లడించింది. టికెట్ మీద విధించిన పన్నులు మాత్రమే కస్టమర్కు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాల ఆఫర్లను స్పైస్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉండగా..
అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2,469 ఉంది.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







