స్పైస్జెట్ బాటలోనే ఇండిగో పయనం
- January 23, 2018స్పైస్జెట్ బాటలోనే ఇండిగో
దిల్లీ: స్పైస్జెట్ బాటలోనే మరో ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో పయనించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరిమిత కాల ఆఫర్లు, రాయితీలు ప్రకటించింది. రూ.797 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లను అందిస్తుంది. జనవరి 22 నుంచి 25 మధ్యలో ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణించే సదుపాయం ఉంది. విమానంలో పరిమిత సీట్లను మాత్రమే ఈ ఆఫర్ కింద కేటాయించడం జరిగిందని, ఒకవేళ ఆఫర్ సీట్లు అయిపోతే ధర మాములుగానే వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి నగదు వెనక్కి ఇవ్వబోమని ఇండిగో వెల్లడించింది. టికెట్ మీద విధించిన పన్నులు మాత్రమే కస్టమర్కు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాల ఆఫర్లను స్పైస్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉండగా..
అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2,469 ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ