ఎమిరేట్స్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరి మృతి
- January 23, 2018
దుబాయ్: ఓ ట్రక్, ఓ మినీ బస్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. షార్జా వైపుగా ఎమిరేట్స్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయాల పాలైనట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ జుమా సలెమ్ బిన్ సువైదాన్ మాట్లాడుతూ, శనిరవా రాత్రి 7 గంటల సమయంలో జరిగిన మర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. మూడు వాహనాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వాహనం ట్రాఫిక్ లేన్ డిసిప్లిన్ని పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో అల్ ఖయిల్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో ఓ మోటరిస్ట్ గాయాల పాలయ్యాడు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







