ఎమిరేట్స్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరి మృతి
- January 23, 2018దుబాయ్: ఓ ట్రక్, ఓ మినీ బస్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. షార్జా వైపుగా ఎమిరేట్స్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయాల పాలైనట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ జుమా సలెమ్ బిన్ సువైదాన్ మాట్లాడుతూ, శనిరవా రాత్రి 7 గంటల సమయంలో జరిగిన మర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. మూడు వాహనాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వాహనం ట్రాఫిక్ లేన్ డిసిప్లిన్ని పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో అల్ ఖయిల్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో ఓ మోటరిస్ట్ గాయాల పాలయ్యాడు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం