ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా సరి కొత్తగా అనసూయ
- January 23, 2018
పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాయత్రి. ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ గా తెలుస్తుంది హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మంచు విష్ణు ఇందులో ముఖ్య పాత్ర పోషించనుండగా, ఆయన సరసన శ్రేయ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన పాత్రల లుక్స్ ఒక్కోటిగా విడుదల చేస్తున్న టీం తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తుంది. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ కథలో ప్రాధాన్యత ఉండే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది . యాంకర్ గా రాణిస్తున్న అనసూయ మధ్య మధ్యలో ఇలా వెండితెరపై మెరుస్తూ అభిమానులకి పసందైన విందు అందిస్తుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







