ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా సరి కొత్తగా అనసూయ
- January 23, 2018
పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాయత్రి. ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ గా తెలుస్తుంది హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మంచు విష్ణు ఇందులో ముఖ్య పాత్ర పోషించనుండగా, ఆయన సరసన శ్రేయ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన పాత్రల లుక్స్ ఒక్కోటిగా విడుదల చేస్తున్న టీం తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తుంది. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ కథలో ప్రాధాన్యత ఉండే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది . యాంకర్ గా రాణిస్తున్న అనసూయ మధ్య మధ్యలో ఇలా వెండితెరపై మెరుస్తూ అభిమానులకి పసందైన విందు అందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







