ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా సరి కొత్తగా అనసూయ
- January 23, 2018
పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాయత్రి. ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ గా తెలుస్తుంది హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మంచు విష్ణు ఇందులో ముఖ్య పాత్ర పోషించనుండగా, ఆయన సరసన శ్రేయ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన పాత్రల లుక్స్ ఒక్కోటిగా విడుదల చేస్తున్న టీం తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తుంది. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ కథలో ప్రాధాన్యత ఉండే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది . యాంకర్ గా రాణిస్తున్న అనసూయ మధ్య మధ్యలో ఇలా వెండితెరపై మెరుస్తూ అభిమానులకి పసందైన విందు అందిస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







