తొలి వాహనం ఎలక్ట్రిక్ కావాలి: పీయూష్ గోయల్
- January 24, 2018
దావోస్: భారత జనాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవని, అలాంటివారికి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలిని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదసుసలో డిజైనింగ్ ఫర్ స్మార్ట్ మొబిలిటీ అంశంపై ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉంటుంది. భారత్ వంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో వృద్ధి కనిపిస్తోంది. భారత జానాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవు. అలాంటివారి తొలి వాహనం ఎలక్ట్రిక్ వాహనం కావాలని కోరుకుంటున్నాం అని గోయల్ తెలిపారు. దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. సౌరవిద్యుత వినియోగంలో గత 3.5ఐదేళ్లలో 6 రెట్ల వృద్ధిని సాధించామని, 2022 నాటికి 10 గిగావాట్ల ఉత్పత్తిని అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎల్ఇడి బల్బులను వినియోగంలోకి తెచ్చేందుకు 2015లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టామని, 800మిలియన్ బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఎల్పీజీ ఉండాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లలో 3.5లక్షల కనెక్షన్లను అందుజేశామని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







