యంగ్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం నాలుగు పథకాలు
- January 25, 2018
న్యూఢిల్లీ : దేశంలోని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రకటించింది.దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీ, సీఎస్ఐఆర్ జాతీయ సంస్థల్లో సాగుతున్న పరిశోధనలను టీచర్ అసోసియెట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్స్ లెన్స్ పథకంతో కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలకు జీతం కాకుండా ఏడాదికి రూ.5లక్షల పారితోషికంతోపాటు పాకెట్ మనీ కింద నెలకు రూ.5వేల రూపాయల ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. విదేశీ యూనివర్శిటీలు, లాబోరేటరీల్లో శిక్షణ పొందే వందమంది పీహెచ్ డీ విద్యార్థులకు డాక్టరేట్ ఫెలోషిప్ అందించేలా రెండో పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. విదేశీ డాక్టరేట్ ఫెలోషిప్ పథకం కింద నెలకు 2,000 డాలర్లతోపాటు విదేశీ విమాన ప్రయాణం, వీసా ఫీజుల కింద రూ.60వేలు అందిస్తామని చెప్పారు. వంద మంది పరిశోధకులకు పరిశోధక అవార్డు కింద నెలకు పదిహేనువేల రూపాయల ఫెలోషిప్ ను మూడేళ్ల పాటు ఇస్తామని మంత్రి ప్రకటించారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలో 20వేలమందికి ప్రోత్సహకాలు అందిస్తామని కేంద్రమంత్రి వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







