యంగ్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం నాలుగు పథకాలు
- January 25, 2018
న్యూఢిల్లీ : దేశంలోని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రకటించింది.దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీ, సీఎస్ఐఆర్ జాతీయ సంస్థల్లో సాగుతున్న పరిశోధనలను టీచర్ అసోసియెట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్స్ లెన్స్ పథకంతో కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలకు జీతం కాకుండా ఏడాదికి రూ.5లక్షల పారితోషికంతోపాటు పాకెట్ మనీ కింద నెలకు రూ.5వేల రూపాయల ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. విదేశీ యూనివర్శిటీలు, లాబోరేటరీల్లో శిక్షణ పొందే వందమంది పీహెచ్ డీ విద్యార్థులకు డాక్టరేట్ ఫెలోషిప్ అందించేలా రెండో పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. విదేశీ డాక్టరేట్ ఫెలోషిప్ పథకం కింద నెలకు 2,000 డాలర్లతోపాటు విదేశీ విమాన ప్రయాణం, వీసా ఫీజుల కింద రూ.60వేలు అందిస్తామని చెప్పారు. వంద మంది పరిశోధకులకు పరిశోధక అవార్డు కింద నెలకు పదిహేనువేల రూపాయల ఫెలోషిప్ ను మూడేళ్ల పాటు ఇస్తామని మంత్రి ప్రకటించారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలో 20వేలమందికి ప్రోత్సహకాలు అందిస్తామని కేంద్రమంత్రి వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









