యంగ్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం నాలుగు పథకాలు
- January 25, 2018
న్యూఢిల్లీ : దేశంలోని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రకటించింది.దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీ, సీఎస్ఐఆర్ జాతీయ సంస్థల్లో సాగుతున్న పరిశోధనలను టీచర్ అసోసియెట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్స్ లెన్స్ పథకంతో కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలకు జీతం కాకుండా ఏడాదికి రూ.5లక్షల పారితోషికంతోపాటు పాకెట్ మనీ కింద నెలకు రూ.5వేల రూపాయల ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. విదేశీ యూనివర్శిటీలు, లాబోరేటరీల్లో శిక్షణ పొందే వందమంది పీహెచ్ డీ విద్యార్థులకు డాక్టరేట్ ఫెలోషిప్ అందించేలా రెండో పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. విదేశీ డాక్టరేట్ ఫెలోషిప్ పథకం కింద నెలకు 2,000 డాలర్లతోపాటు విదేశీ విమాన ప్రయాణం, వీసా ఫీజుల కింద రూ.60వేలు అందిస్తామని చెప్పారు. వంద మంది పరిశోధకులకు పరిశోధక అవార్డు కింద నెలకు పదిహేనువేల రూపాయల ఫెలోషిప్ ను మూడేళ్ల పాటు ఇస్తామని మంత్రి ప్రకటించారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలో 20వేలమందికి ప్రోత్సహకాలు అందిస్తామని కేంద్రమంత్రి వివరించారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







