అవినీతి: 95 మందిపై విచారణ!
- January 25, 2018
సౌదీ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ముగింపుకు వచ్చిన దరిమిలా, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్కి నిరాకరించిన 95 మంది నిందితులపై విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్ ప్రాజిక్యూషన్ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2017 చివరి క్వార్టర్లో అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్ని చేపట్టారు. ఈ క్యాంపెయిన్లో చాలామంది సెటిల్మెంట్స్కి అంగీకరించారు. అలాంటివారిపై చర్యలను ఉపసంహరించడం జరిగింది. నగదు, రియల్ ఎస్టేట్, ఇతర ఆస్తులకు సంబంధించిన సెటిల్మెంట్స్ జరిగాయి. ఇంకా 95 మంది సెటిల్మెంట్స్కి నిరాకరించడంతో వారిని అరెస్ట్ చేయనున్నారు. 90 రోజుల విచారణలో 350 మంది అనుమానితులకు యాంటీ కరప్షన్ కమిటీ సమన్లు జారీ చేసింది. 1980 నుంచి అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోతోందని ఈ సందర్బంగా అదికారులు పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, అవినీతిపై యుద్ధం ఎప్పటినుంచో జరుగుతున్నా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రౌన్ప్రిన్స్, యాంటీ కరప్షన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ని ఈ పదవిలో నియమించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









