అవినీతి: 95 మందిపై విచారణ!
- January 25, 2018
సౌదీ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ముగింపుకు వచ్చిన దరిమిలా, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్కి నిరాకరించిన 95 మంది నిందితులపై విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్ ప్రాజిక్యూషన్ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2017 చివరి క్వార్టర్లో అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్ని చేపట్టారు. ఈ క్యాంపెయిన్లో చాలామంది సెటిల్మెంట్స్కి అంగీకరించారు. అలాంటివారిపై చర్యలను ఉపసంహరించడం జరిగింది. నగదు, రియల్ ఎస్టేట్, ఇతర ఆస్తులకు సంబంధించిన సెటిల్మెంట్స్ జరిగాయి. ఇంకా 95 మంది సెటిల్మెంట్స్కి నిరాకరించడంతో వారిని అరెస్ట్ చేయనున్నారు. 90 రోజుల విచారణలో 350 మంది అనుమానితులకు యాంటీ కరప్షన్ కమిటీ సమన్లు జారీ చేసింది. 1980 నుంచి అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోతోందని ఈ సందర్బంగా అదికారులు పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, అవినీతిపై యుద్ధం ఎప్పటినుంచో జరుగుతున్నా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రౌన్ప్రిన్స్, యాంటీ కరప్షన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ని ఈ పదవిలో నియమించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







