కృష్ణా బోర్డు హైదరాబాద్ నుండి అమరావతికి
- January 25, 2018
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి తరలనుంది. ఈ మేరకు కార్యాలయం తరలింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ.. కృష్ణా బోర్డు ఛైర్మన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్యాలయాన్ని ఏపీలోని వెలగపూడికి తరలించాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉందని, కార్యాలయానికి అనువైన భవనాన్ని ఎంపిక చేసి తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసింది.
అయితే ఈ నెలాఖరు వరకు దీనిపై కదలిక వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత బోర్డు ఛైర్మన్ శ్రీవాత్సవ పదవీవిరమణ చేయనున్నారు. కొత్త ఛైర్మన్ వచ్చిన తర్వాతే దానిపై ముందడుగు పడే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి బోర్డు ఆదేశాల ప్రకారమే నీటి విడుదల జరగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







