చిత్రీకరణలో 'సాక్ష్యం' సినిమా
- January 25, 2018
యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ 'రాజు గారి గది' సినిమాతో సత్తా చాటాడు. ఆ సినిమా తరువాత నాగార్జునతో 'రాజుగారి గది 2' తీసిన పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ దర్శకుడే బెల్లం కొండ శ్రీనివాస్తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాధామోహన్ నిర్మించబోతున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతోందని వార్తలు వస్తున్న నైపథ్యంలో ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది.
హీరోయిన్ ఎవరు? టెక్నీషియన్స్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదని సమాచారం. ఏదైనా ఫైనల్ అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమాలో నటిస్తున్నాడు. పంచబూతాలను మనిషికి అన్వయిస్తూ రూపొందిన కాన్సెప్ట్ ఇది. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇటీవలే దుబాయ్ లో సినిమా షూటింగ్ జరుపుకుంది.దుబాయ్ లో సినిమా షూటింగ్ కి సంబంధించిన అనుమతులు మరియు తగిన ఏర్పాట్లు దేవా,నిఖిల్ చేసారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!







