ఢిల్లీలో ఏషియన్ సమ్మిట్....పాల్గొన్న 10దేశాల అగ్రనేతలు
- January 25, 2018
ఢిల్లీలో ఏషియన్ సమ్మిట్ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా.. 10దేశాలకు చెందిన అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 25ఏళ్ల ఇండో- ఏషియన్ దేశాల మైత్రి, సాధించిన ప్రగతిపై చర్చించారు. మిత్ర దేశాలతో స్నేహ సంబంధాలు, టెర్రరిజం, రక్షణే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. చైనా సరిహద్దు అంశాలు సహా.. ఉప ఖండంపై డ్రాగన్ కంట్రీ ఆర్ధిక వ్యవస్థ ప్రభావంపై చర్చించారు.
ఏషియన్ - ఇండియా స్మారక సదస్సులో భాగంగా 10 ఆసియా దేశాల నేతలతో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మొదట థాయ్ లాండ్ ప్రధానితో భేటీ అయిన మోడీ, తర్వాత సింగపూర్, బ్రూనై సుల్తాన్ మిగతా నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.
అంతకు ముందు 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు వచ్చిన 10 ఆసియా దేశాల అగ్రనేతలకు.. ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సతీమణులతో కలిసి రాష్ట్రపతి భవన్ చేరుకున్న ఏసియాన్ దేశాధినేతలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. రాష్ట్రపతి దంపతులు ఏసియాన్ దేశాధినేతలకు విందు ఇచ్చారు.
ఇవాళ జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో.. ఏషియన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సతీమణులతో కలిసి భారత సైనిక గౌరవ వందాన్ని స్వీకరిస్తారు.
పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నేత విష్ణుకుమార్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపుతున్నాయి. బీజేపీ నైతికతను ప్రశ్నిస్తూ టీడీపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీకి చెందిన సురేష్ ప్రభును పార్టీలో చేర్చుకొని కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదా అంటూ విష్ణుకుమార్రాజును నిలదీశారు. బీహార్లో పార్టీ ఫిరాయింపులపైనా ప్రశ్నించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







