తాలిబన్, హక్కానీ నేతలపై అమెరికా ఆంక్షలు
- January 26, 2018_1516959185.jpg)
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా మరో నలుగురు తాలిబన్, ఇద్దరు హక్కానీ నెట్వర్క్ నేతలపై ఆంక్షల కొరడా విధించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్ తమతో కలిసి పనిచేయాలని, తమ భూభాగంలో ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇవ్వరాదని, ముష్కర మూకలకు నిధులు అందకుండా చూడాలని స్పష్టం చేసింది. తాలిబన్ నేతలు అబ్దుల్ సమద్సనీ, అబ్దుల్ ఖాదీర్ బషీర్, హఫీజ్ మహ్మద్ పొపుల్ జాయ్, మౌలాబీ ఇనాయితుల్లా, హక్కానీ నెట్వర్క్ చెందిన ఫకీర్ మహ్మద్, గులాఖాన్ హమీద్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. అగ్రరాజ్యం అధికార పరిధిలో ఉండే వీరి ఆస్తులను జప్తు చేయడంతో పాటు అమెరికన్లు ఎవరూ వీరితో లావాదేవీలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు విధించింది. సంకీర్ణ దళాలపై దాడులు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి