తాలిబన్, హక్కానీ నేతలపై అమెరికా ఆంక్షలు
- January 26, 2018
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా మరో నలుగురు తాలిబన్, ఇద్దరు హక్కానీ నెట్వర్క్ నేతలపై ఆంక్షల కొరడా విధించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్ తమతో కలిసి పనిచేయాలని, తమ భూభాగంలో ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇవ్వరాదని, ముష్కర మూకలకు నిధులు అందకుండా చూడాలని స్పష్టం చేసింది. తాలిబన్ నేతలు అబ్దుల్ సమద్సనీ, అబ్దుల్ ఖాదీర్ బషీర్, హఫీజ్ మహ్మద్ పొపుల్ జాయ్, మౌలాబీ ఇనాయితుల్లా, హక్కానీ నెట్వర్క్ చెందిన ఫకీర్ మహ్మద్, గులాఖాన్ హమీద్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. అగ్రరాజ్యం అధికార పరిధిలో ఉండే వీరి ఆస్తులను జప్తు చేయడంతో పాటు అమెరికన్లు ఎవరూ వీరితో లావాదేవీలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు విధించింది. సంకీర్ణ దళాలపై దాడులు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







