తాలిబన్, హక్కానీ నేతలపై అమెరికా ఆంక్షలు
- January 26, 2018
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా మరో నలుగురు తాలిబన్, ఇద్దరు హక్కానీ నెట్వర్క్ నేతలపై ఆంక్షల కొరడా విధించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్ తమతో కలిసి పనిచేయాలని, తమ భూభాగంలో ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇవ్వరాదని, ముష్కర మూకలకు నిధులు అందకుండా చూడాలని స్పష్టం చేసింది. తాలిబన్ నేతలు అబ్దుల్ సమద్సనీ, అబ్దుల్ ఖాదీర్ బషీర్, హఫీజ్ మహ్మద్ పొపుల్ జాయ్, మౌలాబీ ఇనాయితుల్లా, హక్కానీ నెట్వర్క్ చెందిన ఫకీర్ మహ్మద్, గులాఖాన్ హమీద్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. అగ్రరాజ్యం అధికార పరిధిలో ఉండే వీరి ఆస్తులను జప్తు చేయడంతో పాటు అమెరికన్లు ఎవరూ వీరితో లావాదేవీలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు విధించింది. సంకీర్ణ దళాలపై దాడులు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









