మతి స్థిమితం కోల్పోవడంతో ఓ పౌరుడు పలువురిపై దాడి

- January 26, 2018 , by Maagulf
మతి స్థిమితం కోల్పోవడంతో  ఓ పౌరుడు పలువురిపై దాడి

కువైట్ : మనస్సు ఓ సున్నితమైన అద్దం వంటిది...పాపం ఆ పౌరుని మనస్సు ఏ విధంగా చలించిందో తెలియదు. ఆకస్మికంగా పిచ్చివాడిగా మారిపోయాడు..ఆ పరిస్థితిలో పలువురిపై దాడి చేసాడు. ఒక తెలియని ఉద్రేకంతో ఉన్మాది మాదిరిగా మారి ఒక వృద్ధ మహిళపై దాడి చేశాడు. అనంతరం  కో ఆప్ వద్ద ఒక మంగలి దుకాణం కిటికీలను ధ్వంసం చేశాడు. గాయపడిన వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోనికి తీసుకొని చికిత్స నిమిత్తం మానసిక వైద్యశాలకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com