బహ్రెయిన్ లో భవనం నుండి పడిపోయి బాలుడి మృతి
- January 27, 2018
మనామ : కల్లా కపటం తెలియని పిల్లలు అనూహ్యంగా ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోయి తల్లితండ్రులకు జీవితాంతం తీరని శోకం మిగిల్చివెళతారు. అందుకే చిన్నారుల రక్షణ పట్ల కన్నవారు అత్యంత జాగ్రత్త వహించాలి. ఉత్తర గవర్నరేట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనంపై నుంచి అకస్మాతుగా కిందకు పడిపోయి ఓ బాలుడు మరణించాడు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిదేళ్ల వయస్సు గల ఖరార్ అబ్బాస్ గురువారం రాత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం బుద్ధాయ్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షాఖురా గ్రామంలో నిర్మాణంలో ఉన్నభవనం పై అంతస్థు నుంచి కిందకు పడటంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతో ఖరార్ అబ్బాస్ అంతిమ శ్వాస విడిచాడు. ఉమ్ అల్ హస్సమ్లోని షేక్ మైథం అల్ బహ్రాని స్మశానంలో శనివారం ఉదయం బాలుడి మృతదేహంను ఖననం చేశారు. స్థానిక పౌరులు, బంధువులు మరియు కుటుంబ స్నేహితులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు