బహ్రెయిన్ లో భవనం నుండి పడిపోయి బాలుడి మృతి
- January 27, 2018
మనామ : కల్లా కపటం తెలియని పిల్లలు అనూహ్యంగా ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోయి తల్లితండ్రులకు జీవితాంతం తీరని శోకం మిగిల్చివెళతారు. అందుకే చిన్నారుల రక్షణ పట్ల కన్నవారు అత్యంత జాగ్రత్త వహించాలి. ఉత్తర గవర్నరేట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనంపై నుంచి అకస్మాతుగా కిందకు పడిపోయి ఓ బాలుడు మరణించాడు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిదేళ్ల వయస్సు గల ఖరార్ అబ్బాస్ గురువారం రాత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం బుద్ధాయ్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షాఖురా గ్రామంలో నిర్మాణంలో ఉన్నభవనం పై అంతస్థు నుంచి కిందకు పడటంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతో ఖరార్ అబ్బాస్ అంతిమ శ్వాస విడిచాడు. ఉమ్ అల్ హస్సమ్లోని షేక్ మైథం అల్ బహ్రాని స్మశానంలో శనివారం ఉదయం బాలుడి మృతదేహంను ఖననం చేశారు. స్థానిక పౌరులు, బంధువులు మరియు కుటుంబ స్నేహితులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







