బహ్రెయిన్ లో భవనం నుండి పడిపోయి బాలుడి మృతి
- January 27, 2018
మనామ : కల్లా కపటం తెలియని పిల్లలు అనూహ్యంగా ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోయి తల్లితండ్రులకు జీవితాంతం తీరని శోకం మిగిల్చివెళతారు. అందుకే చిన్నారుల రక్షణ పట్ల కన్నవారు అత్యంత జాగ్రత్త వహించాలి. ఉత్తర గవర్నరేట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనంపై నుంచి అకస్మాతుగా కిందకు పడిపోయి ఓ బాలుడు మరణించాడు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిదేళ్ల వయస్సు గల ఖరార్ అబ్బాస్ గురువారం రాత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం బుద్ధాయ్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షాఖురా గ్రామంలో నిర్మాణంలో ఉన్నభవనం పై అంతస్థు నుంచి కిందకు పడటంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతో ఖరార్ అబ్బాస్ అంతిమ శ్వాస విడిచాడు. ఉమ్ అల్ హస్సమ్లోని షేక్ మైథం అల్ బహ్రాని స్మశానంలో శనివారం ఉదయం బాలుడి మృతదేహంను ఖననం చేశారు. స్థానిక పౌరులు, బంధువులు మరియు కుటుంబ స్నేహితులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







